
పుట్టుకలో.. మార్కుల్లో ట్విన్స్
బలిజిపేట: మండలంలోని వంతరాం గ్రామానికి చెందిన బెవర శరణ్ కార్తికేయ, బెవర సింధు శరణ్య కవల పిల్లలు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచు లు ఒకేలా ఉంటాయి. చదువులోనూ ట్విన్స్గానే సాగుతున్నారు. అన్నాచెల్లి ఇద్దరూ వంతరాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుని మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదోతరగతి ఫలితా ల్లో ఇద్దరికీ 582 మార్కుల చొప్పున వచ్చాయి. ఒకేలా మార్కులు రావడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే రీతిన రాణిస్తున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు ఉమ(బాడంగి కేజీబీవీ టీచర్), రాము (న్యాయవాది) మురిసిపోతున్నారు. ఇద్దరికీ హెచ్ఎం చిన్నికృష్ణ, ఉపాధ్యాయులు స్వీట్లు తినిపించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరు కోవాలని ఆకాంక్షించారు.