ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు

Apr 22 2025 1:05 AM | Updated on Apr 22 2025 1:05 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు

విజయనగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలకు సంబంధించి రెండు, మోసాలకు పాల్పడినవి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయి. వీటికి స్పందించిన ఎస్పీ వకుల్‌ జిందల్‌ సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏఎస్పీ సౌమ్యలత, ఎస్‌బీ సీఐలు లీలారావు, చౌదరి, డీఎస్‌ఆర్‌పీ ఎస్‌ఐ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

– విజయనగరం క్రైం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement