
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు
విజయనగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలకు సంబంధించి రెండు, మోసాలకు పాల్పడినవి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయి. వీటికి స్పందించిన ఎస్పీ వకుల్ జిందల్ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏఎస్పీ సౌమ్యలత, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీఎస్ఆర్పీ ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం క్రైం