
భక్తి శ్రద్ధలతో ఈస్టర్
పాలకొండ రూరల్: చినమంగళాపురంలో కొవ్తొత్తులతో ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు
పాలకొండ రూరల్: లోకరక్షకుడు క్రీస్తు పునరుత్థానం(ఈస్టర్) వేడుకలను ఆదివారం ఊరువాడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ విశ్వాసులు చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో పాలకొండ మండలంలోని చిన మంగళాపురం మందిరంలో పాస్టర్ నేతృత్వంలో విశేష ప్రార్థనలు చేపట్టి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పాలకొండ పట్టణంలోని బేతేలు బాప్టిస్ట్ చర్చి నిర్వాహకుడు ఆదాము ఫాధర్ నేతృత్వంలో సమాధుల వద్ద తమ పూర్వీకులను స్మరిస్తూ ప్రార్థనలు చేశారు.

భక్తి శ్రద్ధలతో ఈస్టర్