అర్హులైన యువత, ఓటర్లు అందరూ ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను వినియోగించుకోవాలి. తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు అవసరమైన నమోదు, సవరణ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఓటర్ల నుంచి దరఖాస్తులు, అభ్యంతరాలు, ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– కె.గోపాలకృష్ణ, ఆర్డీఓ, సత్తెనపల్లి


