అవయవదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు 20 ఏళ్లుగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా సంఘం చేస్తున్న కృషి ఫలితంగా ఏపీ, తెలంగాణలో 60 వేల మంది తమ శరీర దానానికి ముందుకొచ్చి మాకు అనుమతి పత్రాలు అందజేశారు. మా ట్రస్ట్లో వెయ్యి మంది అవయవదాతలు పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వాలు అవయవదాతలను ప్రోత్సహించేలా పలు రాయితీలు ఇస్తే బాగుంటుంది.
–డాక్టర్ యశస్వి రమణ, శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు


