‘రెవెన్యూ’ ఎన్నికల కోలాహ లం
నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఎ) జిల్లా అధ్యక్షుడిగా మాచవరం తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసరావుపేటలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలరెడ్డి పేర్కొన్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా దాచేపల్లి తహసీల్దార్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కారంపూడి తహసీల్దార్ ఆర్.వెంకటేశ్వర్లునాయక్, నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు శిరిగురి నాగరాజకుమారి, బొల్లాపల్లి తహసీల్దార్ ఏవీ సుధాకర్, పల్నాడు జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ షేక్ బాజి ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్చంపేట తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, కార్యదర్శిగా క్రోసూరు తహసీల్దార్ వీవీ.నాగరాజు, సంయుక్త కార్యదర్శులుగా పెరుసుమల నరసయ్య, నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి చెందిన నంద్యాల ఆంజనేయులు, వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు వి.నాగవల్లి, రెంటచింతల తహసీల్దార్ కార్యాలయ ఎంఆర్ఐ ఎం.మనమోహన్ప్రసాదు, కోశాధికారిగా సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.కోటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కలెక్టరేట్లోని జూనియర్ అసిస్టెంట్ పి.వీరప్రతాప్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గురజాల ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వి.వెంకటరెడ్డి, మాచవరం తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు పి.నరేష్ ఎన్నికయ్యారు.
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా ..
రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న నాగమల్లేశ్వరరావును ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది సత్కరించారు. పిడుగురాళ్ల ప్రజలు తమ తహసీల్దార్ జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు


