పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు | - | Sakshi
Sakshi News home page

పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు

Aug 21 2025 6:54 AM | Updated on Aug 21 2025 6:54 AM

పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు

పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు

● గత సంవత్సరం పండించిన పొగాకును సరైన ధరకు కొన్నవారే లేరని, ఇప్పటికీ సగం పొగాకు రైతులు వద్ద మిగిలిఉందని చెప్పారు. కంపెనీల చేత పొగాకుని ప్రభుత్వం కొలిపించలేకపోయిందని విమర్శించారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ సంస్థను పొగాకు కొనటానికి ఏర్పాటు చేసినప్పటికీ మార్క్‌ ఫెడ్‌ సంస్థ పొగాకును పూర్తిగా కొనలేదన్నారు. ● మిర్చికి ఖర్చులు, తెగుళ్లు ఎక్కువగావటమే కాకుండా ధర కూడా పడిపోయిందన్నారు. ఇలాంటి స్థితిలో ఏ పంట వేయాలో తెలియనటువంటి తీవ్ర గందరగోళంలో రైతులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పత్తి దిగుమతులను ఆహ్వానించటం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లమడ రైతు సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు

చిలకలూరిపేట: ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద అన్ని రకాల సుంకాలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం దారుణమని నల్లమడ రైతు సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయం పత్తి రైతులకు మరణ శిక్ష విధింపుతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా కూడా ఇది రైతు వ్యతిరేక చర్య అని ఖండించిందని వెల్లడించారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించే ప్రభుత్వ నోటిఫికేషన్‌ పత్తి రైతులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో పండించే పత్తి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. దేశీయంగా పండించే పత్తి ధర ఖచ్చితంగా తగ్గుతుందని, రైతులు మరింత అప్పుల పాలవుతారన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,075 రావాలని, కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,710 మాత్రమే ఉందని వెల్లడించారు. ఆ ధరకు కూడా పత్తి అమ్ముడు పోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకం ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పత్తి రైతులకు తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement