
ముగిసిన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ బూట్ క్యాంప్
పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్లో రెండు రోజుల నుంచి జరుగుతున్న బూట్ క్యాంప్ మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, హై సెక్యూరిటీ డోర్ లాకింగ్ సిస్టం, డిజైనింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ కార్డ్స్, ఈ–వేస్ట్ కలెక్షన్ వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మకతతో ప్రాజెక్ట్లను తయారు చేశారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషించబోతుందని, ఇన్నోవేటివ్ స్పిరిట్ తో విద్యార్థులు ముందడుగు వేయాలని అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ ఆఫీసర్ మరియు యునిసెఫ్ కన్సల్టెంట్ సుదర్శన్ అన్నారు. స్టేట్ హబ్ మెంటార్ వెంకటేష్ మాట్లాడారు. క్యాంపులో బృగుబండ, ఆర్.కె.పురం పిన్నెల్లి, అమరావతి, 75 త్యాళ్లూరు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంప్ ముగిసిన అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. హెచ్ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, అటల్ ల్యాబ్ ఇన్చారి్జ్ కె.వి.సుబ్బారావు, మెంటర్స్ వేణు, సుజిత, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైభవంగా వ్రిగహ ప్రతిష్టా మహోత్సవాలు
అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో నూతనంగా నిర్మితమైన దేవాలయంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చతుస్థానార్చనలు, శాంతిహోమాలు జరిపించారు. పవిత్ర కృష్ణానది జలాల్లో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహలను, జీవధ్వజాన్ని జలాధివాసం చేసిన అనంతరం అమరావతి పురవీధులలో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. పలువురు భక్తుల వార్లు పోసి పూజలు నిర్వహించారు.
26 నుంచి ఏఐఎస్ఎఫ్
శిక్షణ తరగతులు
లక్ష్మీపురం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బందెల నాసర్జీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఈ సంవత్సరం అమలు చేయలేమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, వెంకట్, అజయ్, అమీర్, సాయి గణేష్, చందు, కిషోర్, ఏలియా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్లకు చెందిన గోదాటి కిరణ్ (35) ఆటోలో గుంటూరులో ముగ్గురు ప్రయా ణికులను ఎక్కించుకొని బాపట్లకు బయలు దేరాడు. మార్గ మధ్యలో చేబ్రోలు సినిమా హాలు దాటిన తరువాత వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఇంద్ర వాహనం ఢీ కొట్టింది. ఆటో నడుపుతున్న కిరణ్ తలకు బలమైన గాయవటంతో ఆటోలోనే అక్కడక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న మిగిలిన ముగ్గురికి ఎటువంటి గాయాలు కాలేదు. చేబ్రోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ బాపట్ల పట్టణంలోని బేతానీ కాలనీ వాసిగా గుర్తించారు.

ముగిసిన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ బూట్ క్యాంప్

ముగిసిన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ బూట్ క్యాంప్