రాయగడ: జిల్లాలోని రామనగుడ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర నాఽథ్ కుహరో, వివిధ రెవెన్యూ కేసులు, ఆదాయ వసూళ్లపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉకుంబా గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్గా తొలిసారిగా తహసీల్ కార్యాలయానికి వచ్చిన కుహరోను తహసీల్దార్ ప్రాణ కృష్ణ పాణిగ్రహి, అదనపు తహసీల్దార్ గయా డంబురుధర్ బెహర, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. పట్టాల పంపణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రీనా బౌరి, మదన్ పండ పాల్గొన్నారు.


