చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల | - | Sakshi
Sakshi News home page

చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల

Apr 29 2025 9:41 AM | Updated on Apr 29 2025 9:41 AM

చిత్ర

చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలోని జలాశాయంలోకి కోటి రూపాయల విలువ చేసే చేపపిల్లలను జిల్లా మత్స్యశాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. సేతు యోజన పథకంలో భాగంగా వీటిని విడుదల చేసినట్టు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రమోద్‌ కుమార్‌ జేన్నా తెలిపారు. సమితిలోని తొమ్మిది పంచాయతీలకు చెందిన ప్రజలు చి త్రకొండ జలాశయంలో చేపలవేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. చేప పిల్లలు పెరి గి పెద్దవి అయితే అధిక రాబడి వస్తుందన్నారు.

విస్తరాకులు కుట్టిన కలెక్టర్‌

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ కలెక్టర్‌ డాక్టర్‌ శుభంకర్‌ మహాపాత్రో విస్తరాకులు కుట్టి మహిళలకు స్ఫూర్తినిచ్చారు. సోమవారం జిల్లాలోని పపడాహండి సమితి సెమ్లా గ్రామంలో ఒర్మాస్‌ సహాయ సహకారాలతో నడుస్తున్న మాత్రుశక్తి ప్రొడ్యూసర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న విస్తరాకులను మిషన్‌ ద్వారా కుట్టి మహిళలను ఆశ్చర్య పరిచారు.

నిలిచిన పపడాహండి–

ఉమ్మర్‌కోట్‌ మార్గం

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా పపడాహండి–ఉమ్మర్‌ కోట్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ భారీ వాన కురిసింది. పపడా హండి సమీపంలో సాయుధ స్థూపం సమీపంలో కల్వర్టు నిర్మాణంలో ఉంది. వాహనాల రాకపోకల కోసం పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు మొత్తం నీటితో నిండిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి.

రోడ్డెక్కిన ప్రజలు

కొరాపుట్‌: విద్యుత్‌, తాగునీటి కోసం సోమవా రం కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌ సమితి ఒడియా పెంట గ్రామ పంచాయతీ కేంద్రంలో ప్రజలు రోడ్డెక్కారు. లక్ష్మీపూర్‌–టికిరి మార్గంలో రోడ్డుపై ఖాళీ కుండలతో ధర్నాకు దిగారు. విద్యుత్‌ వైర్లు తెగిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందన్నారు. గ్రామంలో తాగునీటి సర ఫరా లేదని ఆరోపించారు. వెంటనే అధికారు లు అక్కడకు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ వైర్లు కలపి పునరుద్ధరించారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సునాలీ కార్జికి నాలుగో ర్యాంకు

పర్లాకిమిడి: బరంపురం విశ్వవిద్యాలయం ప్లస్‌త్రీ పరీక్ష ఫలితాలు సోమవారం ప్రకటించింది. పర్లాకిమిడి మహిళా కళాశాల ప్లస్‌త్రీ డిగ్రీ విద్యార్థినులు సోషల్‌ సైన్సు విభాగంలో ర్యాంకులు సాధించారు. వారిలో ఒకరు సోనాలీ కార్జి సోషల్‌ సైన్సులో నాలుగో ర్యాంకు సాధించారు. పదో ర్యాంకును సునీతా ప్రధాన్‌ సాధించారు. వీరికి ప్రిన్సిపాల్‌ రీనా సాహు, అధ్యాపకురాలు ముధుస్మితా ప్రధాన్‌లు మెమోంటోలతో సత్కరించారు.

చిత్రకొండ జలాశయంలో  చేప పిల్లలు విడుదల 1
1/4

చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల

చిత్రకొండ జలాశయంలో  చేప పిల్లలు విడుదల 2
2/4

చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల

చిత్రకొండ జలాశయంలో  చేప పిల్లలు విడుదల 3
3/4

చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల

చిత్రకొండ జలాశయంలో  చేప పిల్లలు విడుదల 4
4/4

చిత్రకొండ జలాశయంలో చేప పిల్లలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement