
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
ఆటోనగర్(విజయవాడతూర్పు): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి అయినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు కొనుగోలు చేసిన బస్సులు.. నాలుగు నెలల కిందట ఆటోనగర్ డిపోకు చేరాయి. వాటిని అధికారుల వినియోగించకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్న విషయాన్ని ఇటీవల సాక్షి దినపత్రిక ‘రోడ్డెక్కని కొత్త బస్సులు’ అనే శీర్షికన ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ బస్సులన్నింటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి, దాదాపుగా పూర్తి చేశారు. డిపోకు మొత్తం 11 బస్సులు మంజూరవగా.. ఇందులో 4 బస్సులు గత కొద్ది రోజుల నుంచి నడుపుతున్నట్టు డీఎం ప్రవీణ్కుమార్ చెప్పారు. మరో 7 బస్సులకు పర్మిట్ రావాల్సి ఉందని, త్వరలో వచ్చే అవకాశం ఉందని వివరించారు.

రోడ్డెక్కనున్న కొత్త బస్సులు