నిజామాబాద్ అర్బన్: గ్రామాల అభివృద్ధి సజావుగా జరగాలంటే తమకే ‘చెక్కు’ అధికారం ఉండాలని సర్పంచులు కోరారు. చెక్ పవర్ తమకే ఉండేలా చూడాలని కోరుతూ జిల్లాలోని పలు గ్రామాల సర్పంచులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఉపసర్పంచులతో జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో గ్రామ పంచాయతీల పరిపాలనలో తమ అధికారాలు గణనీయంగా తగ్గిపోయి అభివృద్ధి పనులు సాగడం లేదని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న సర్పంచ్లు


