ప్లాస్టిక్‌ కవర్ల దుకాణాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ కవర్ల దుకాణాలపై దాడులు

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలోని పలు ప్లాస్టిక్‌ కవర్ల దుకాణాలు, సింగిల్‌ యూజ్‌ కవర్లు వినియోగిస్తున్న జ్యూస్‌, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, కిరాణా దుకాణాలపై కార్పొరేషన్‌ ఏఎంసీ నజీరుద్దీన్‌ ఆ ధ్వర్యంలో మంగళవారం దాడులు చేశారు. నగరంలోని పెద్దబజార్‌, శివాజీనగర్‌, కిసా న్‌ గంజ్‌, ఖలీల్‌వాడి, గాజుల్‌పేట్‌, తదితర ప్రాంతాల్లో దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సింగిల్‌ యూజ్‌ క వర్లు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానాలు విధించారు. మొత్తం రూ.15వేల వర కు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. శానిటరీ సూపర్‌వైజర్‌ సాజిద్‌ అలీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మహిపాల్‌, కృష్ణ, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement