స్కూటీని ఢీకొన్న స్కూల్‌ బస్‌ | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొన్న స్కూల్‌ బస్‌

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

మాక్లూర్‌: మండలంలోని మాణిక్‌బండార్‌చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం స్కూటీని ఎదురుగా వస్తున్న ఓ స్కూల్‌ బస్సు ఢీకొన్నది. ప్రమాదంలో స్కూటీపై ఉన్న మహిళకు గాయాలయ్యాయి. హె ల్మెట్‌ ఉండడంతో ఆమెకు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ముబారక్‌నగర్‌కు చెందిన కవిత డిచ్‌పల్లి మండలంలోని ఓ జీపీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉదయం రోజు మాదిరిగానే స్కూటీపై డిచ్‌పల్లికి వెళ్తుండగా మాణిక్‌బండార్‌ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న ఓ స్కూల్‌ బస్‌ ఢీకొన్నది. బస్సు ముందు చక్రం కింద స్కూటీ పడింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. హెల్మె ట్‌ ఉండడంతో ఆమె ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement