● సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వస్తూనే ఉన్న దరఖాస్తుదారులు
● నెలల తరబడి నిరీక్షిస్తున్నా
పనులు కాక ఆవేదన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుదారుల్లో కొందరు మళ్లీమళ్లీ వస్తూనే ఉన్నా వారి సమస్యలు పరిష్కారా నికి నోచుకోవడం లేదు. తమ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించేందుకు రెండు, మూడు సార్లు ప్రజావాణికి వచ్చినా సమస్యలు పరిష్కారం కావ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భూభారతి కింద భూసమస్యల పరిష్కారం, నిషేధి త భూముల జాబితా నుంచి తొలగింపు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎక్కువ మంది ప్రజావాణికి వస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు గతంలో నివేదించిన సమస్యలు పరిష్కారం కాక మళ్లీమళ్లీ వస్తుండటం కనిపించింది.


