జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వ్యాపిస్తోంది. మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ వెనకాల ఉన్న ఈ రోడ్డు మీదుగా నిత్యం వందలాది మంది కోర్టు, జెడ్పీ, తహసీల్, ఆర్డీవో కార్యాలయాలకు వెళ్తుంటారు. ఈ మార్గంలో నడవడానికి పాదచారులు నానా పాట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


