ఉపాధి హామీ కూలీలకు వరాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ కూలీలకు వరాలు

Dec 25 2025 10:19 AM | Updated on Dec 25 2025 10:19 AM

ఉపాధి హామీ కూలీలకు వరాలు

ఉపాధి హామీ కూలీలకు వరాలు

నందిపేట్‌(ఆర్మూర్‌): గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రత, జీవనోపాధి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు వరాల జల్లులు కురిపించింది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌)’ (వీబీ–జీ రావ్‌ు జీ)గా మార్చింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. పనిదినాలతో పాటు రోజువారి వేతనాన్ని సైతం కేంద్రం పెంచింది. ఈ పథకం కింద హామీ ఇచ్చే పని దినాల సంఖ్యను ప్రతి సంవత్సరం 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది. ప్రతి సంవత్సరం కనీసం 125 పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రోజువారి కనీస వేతనాన్ని రూ. 240 పెంచింది.

పథకం ప్రయోజనాలు

ఈ పథకాన్ని గ్రామీణ భారతదేశంలో నైపుణ్యం లేని వారికి జీవనోపాధి భద్రతను పెంచడం లక్ష్యంగా మొదటగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 పేరుతో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించారు. తర్వాత మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) గా పేరు మార్చారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, చెరువుల తవ్వకం, నీటి సంరక్షణ, కాలువలు సృష్టించడం వంటి మౌలిక సదుపాయాల పనులను ఈ పథకం కింద చేపడతారు. గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, నగరాలకు వలసలను తగ్గించడంతో పాటు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.

జిల్లాలో జాబ్‌ కార్డుల సంఖ్య 2.51 లక్షలు

ఉపాధి పని చేసేవారి సంఖ్య 4,58,145

100 నుంచి 125 రోజులకు

పెరిగిన పనిదినాలు

కనీస వేతనం సైతం పెంపు

‘వీబీ–జీ రావ్‌ు జీ’ గా పేరు

మార్చిన కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement