
పహల్గాం ఘటన పిరికిపంద చర్య
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ నగర శాఖ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించగా, జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల చేతుల్లో హతమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. – ఖలీల్వాడి/సుభాష్నగర్

పహల్గాం ఘటన పిరికిపంద చర్య