చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు

Apr 24 2025 1:22 AM | Updated on Apr 24 2025 1:22 AM

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు

నిజామాబాద్‌నాగారం: పీసీ పీఎన్‌డీటీ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ సెంటర్‌లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి బద్దం రాజశ్రీ స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో బుధవారం జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు డివిజన్‌లలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పీసీ పీఎన్‌డీటీ చట్టాన్ని అతిక్రమించే, అర్హతలేని వ్యక్తుల రిఫరెన్స్‌పై స్కానింగ్‌ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్‌ రిజిస్టర్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. బోధన్‌లో స్కానింగ్‌ యంత్రం ఉన్న ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో కొత్తగా రెండు ఆస్పత్రుల్లో స్కానింగ్‌ యంత్రాలకు అనుమతించామన్నారు. సలహా సంఘం కమిటీ సభ్యులు వైద్యులు సుప్రియ, బిందు, హరిప్రియ, రేడియాలాజిస్ట్‌ శ్రావణి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత, సీడీపీవో సౌందర్య, ఎన్జీవో పద్మాసింగ్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, మెప్మా డీఎంసీ మాధవీలత, నాగలక్ష్మి, వేణుగోపాల్‌, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక బృందాలతో

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

డీఎంహెచ్‌వో రాజశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement