ఇందిరమ్మ, భూభారతిపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ, భూభారతిపై దృష్టి సారించాలి

Apr 23 2025 9:44 AM | Updated on Apr 23 2025 9:44 AM

ఇందిరమ్మ, భూభారతిపై దృష్టి సారించాలి

ఇందిరమ్మ, భూభారతిపై దృష్టి సారించాలి

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మా ట్లాడారు. పైలట్‌ ప్రాజెక్టుగా భూ భారతి అమలువుతున్న రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వ రకు 5,905 దరఖాస్తులు అందాయని నాలుగు పైలట్‌ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మే మొదటి వారంలో హైదరాబాద్‌ మి నహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలట్‌ మండలంగా తీసుకొని 28 మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లపై..

వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటి వారంలోగా పూర్తి చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. లబ్ధిదారులకు తక్కువ ధరకు స్టీల్‌, సిమెంట్‌ ఇచ్చేవిధంగా త్వరలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 16వ తేదీన జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించా రని తెలిపారు. త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసేలా ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, అధికారులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి..

అనధికార లే అవుట్‌ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 30వ తేదీతో ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు ముగుస్తుందని, పొడిగించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్‌లు, నిర్మాణాలకు అను మతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు.

ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు స్టీల్‌, సిమెంట్‌ అందించేందుకు చర్యలు

వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement