ఆరుగురిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

ఆరుగురిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు

Apr 21 2025 8:15 AM | Updated on Apr 21 2025 8:15 AM

ఆరుగు

ఆరుగురిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో వాహనాలు న డుపుతూ పట్టుబడ్డ ఆరుగురు మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్ర సాద్‌ తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్‌ బైపా స్‌ ఎక్స్‌ రోడ్‌, దుబ్బ బైపాస్‌ ఎక్స్‌ రోడ్డు ప్రాంతాల్లో ఆదివారం తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్లు ధ రించని 371మంది వాహనదారులతోపాటు రాంగ్‌రూట్‌లో వాహనం నడుపుతున్న 36 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. తనిఖీల్లో ఆర్‌ఐ(ఏఆర్‌) శేఖర్‌, ఎస్సైలు రమేశ్‌, సుమన్‌, రహమతుల్లాతోపాటు 25మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

భూ భారతితో వివాదాలకు శాశ్వత పరిష్కారం

పెర్కిట్‌/డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): భూ భారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. భూభారతిపై ఆలూ ర్‌, డొంకేశ్వర్‌ మండల కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా అసలైన హక్కుదారుకు భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోందని, మే మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పో ర్టల్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. రెవె న్యూ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి దర ఖాస్తులు స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపనున్నట్లు పేర్కొన్నారు. భూ వివాదాల్లో కోర్టులకు వెళ్లే పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. ఆధార్‌కార్డు మాదిరిగానే ప్రతి రైతుకు భూములకు సంబంధించిన భూధార్‌ కార్డు కేటాయిస్తామని తెలిపారు. సదస్సులో జాయింట్‌ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో ఉమ్మడి జిల్లా నేతలు

నిజాంసాగర్‌: జిల్లా కేంద్రంలోని సత్య కన్వె న్షన్‌లో ఆదివారం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మ న్‌ దఫేదార్‌ శోభ రాజు దంపతుల పెద్ద కూ తురు కీర్తన వివాహం జరిగింది. వ్యవసా యశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రె డ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారె డ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ బాల్‌రాజ్‌, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గంప గోవర్ధన్‌, జాజాల సురేందర్‌, హన్మంత్‌ సింధే, ఏనుగు రవీందర్‌రెడ్డి, సౌదాగర్‌ గంగారాం, జనార్దన్‌ గౌడ్‌, అరుణతార, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

ఆరుగురిపై మైనర్‌  డ్రైవింగ్‌ కేసులు 1
1/2

ఆరుగురిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు

ఆరుగురిపై మైనర్‌  డ్రైవింగ్‌ కేసులు 2
2/2

ఆరుగురిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement