
‘గొప్ప కార్యం ఉపనయనాలు’
నిజామాబాద్ రూరల్: వేద రక్షణ కోసం ధార్మిక వికాసానికి ఉచిత ఉపనయన సంస్కారం నిర్వహించడం గొప్ప కార్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. 23న సుభాష్నగర్ శ్రీ రామాలయంలో 21 మంది వటువులకు ఉచిత ఉపనయ సంస్కార మహోత్సవానికి ఆహ్వానిస్తూ నిర్వాహకులు జయంత్ కుమార్, రొట్టె సురేష్ శర్మలు ఆదివారం అర్బన్ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. గొప్ప కార్యం చేయడానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఉచిత ఉపనయనాల మహోత్సవానికి బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
డంపింగ్ యార్డులోని
మంటలను అరికట్టండి
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ శివారు మున్సిపల్ డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సబ్కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. ఆదివారం పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలను మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణతో కలిసి పరిశీలించారు. జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
వనజీవి రామయ్యకు
ఘన నివాళులు
ఆర్మూర్టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆదివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ.. ‘వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. నేటి యువతరం ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పర్యావర ణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలన్నారు. కార్యద ర్శి రాస ఆనంద్, గౌరవ సభ్యుడు కాంతి గంగారెడ్డి, చరణ్ రెడ్డి, విజయసారథి, పట్వారి గోపి కృష్ణ్ణ, రాధా కిషన్, ప్రాజెక్ట్ చైర్మన్ పట్వారి తులసి, ఖాందేశ్ సత్యం, మారుతి, నరేష్ తదితరులున్నారు.
ప్రారంభమైన ఓపెన్
ఇంటర్ పరీక్షలు
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్, బాలికల పాఠశాల, బాలుర, పెర్కిట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
నేడు శివాలయంలో ప్రత్యేక పూజలు
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఆలయ పరిసర ప్రాంతాల్లో పల్లకిసేవ నిర్వహించనున్నట్లు కమిటి సభ్యులు పేర్కొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల
పంపిణీ
మాక్లూర్: సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు మంజూరైన లబ్ధిదారులకు ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్రావు చెక్కులను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన బి సత్యెమ్మకు రూ.12 వేలు, కృష్ణానగర్కు చెందిన నాగేశ్వర్రావుకు రూ.60 వేలు మంజూరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి సూచన మేరకు ఆ చెక్కులను వెంకటేశ్వర్రావు లబ్ధిదారులకు అందజేశారు. నాయకులు జాఫర్, అలీమ్, స్వామి, శ్రీను, రాజు, పార్టీ మీడియా మండల కన్వీనర్ జైల్సింగ్ పాల్గొన్నారు.

‘గొప్ప కార్యం ఉపనయనాలు’

‘గొప్ప కార్యం ఉపనయనాలు’