
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా
నిజామాబాద్అర్బన్: జేఈఈ మెయిన్స్– 2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఆలిండియా లెవల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన మేఘన (824), సంకీర్త్ (1,750), భానుప్రతాప్ (3,820), ప్రవీణ్ (7,456), అరవింద్ (11,246), వేదస్కర్ (12, 385), నికేతన్(21,519), హాసిని (30,243), అమృత్ వర్ష్ (39,052), ఎండీ ముద్దస్సర్ (43,733), ఎస్ తనూజ (44,161), ఎం భవ్య శ్రీ (48,472) ర్యాంకు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంటర్తోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ, మెడికల్, ఎంసెట్లలో రాణించడమే లక్ష్యంగా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్తోపాటు తొ లి ప్రయత్నంలోనే డైరెక్ట్గా ఐఐటీ, జేఈఈ మె యిన్స్ పరీక్షల్లో విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు, ప్రిన్సిపాల్ రణదీష్, వైస్ ప్రిన్సిపాల్ సందీప్ కులకర్ణి తదితరులున్నారు.
ఎస్ఆర్ కళాశాలకు ర్యాంకులు..
నగరంలోని ఎస్ఆర్ జూనియ ర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. బాదా వత్ సురేశ్ ఎస్టీ విభాగంలో ఆ లిండియా 98వ ర్యాంకుతోపా టు జిల్లా మొదటి ర్యాంకు సా ధించినట్లు కళాశాల డీజీఎం గోవర్ధన్రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన ఆకాశ్ (1813), బీ సాయి పవ న్ (3248), సచిన్ (3333), అఖిల (3828), ఇపుల్ (4329), శివసాయి (4721), భరత్ (6839), వా సు (6876), అక్షద్ (8071), సాయిచరణ్ (9873) ర్యాంకులు సాధించారన్నారు. 10 వేలలోపు 12 మంది, 20 వేలలోపు 26 మంది ఆలిండియా ర్యాంకులు సాధించారు. 96 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ
నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన పంచమహాల్కర్ రియా ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 2627 ర్యాంకు సాధించినట్లు ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన వేములపల్లి హర్షిత్ (3205), పీ అఖిల్ (4922), వీ గగన శ్రీ (9389), ఎం అజయ్ (9601), కే భాస్కర్ (14,738), పుట్ట రఘునాథ్ (17,899) ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. 10వేల లోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రియా 99.62 శాతం పర్సంటైల్ సాధించిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవి గౌడ్, శేఖర్, శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వెక్టర్ కళాశాల విద్యార్థులకు..
నగరంలోని వెక్టర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. మామిడి నిషాంత్ రెడ్డి (1450), వినాయక్ జోషి (7054), చంద్రవదన్ రెడ్డి (7696) ఆలిండియా ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికైనట్లు తెలిపారు.
9 మంది కాకతీయ విద్యార్థులకు
ఆలిండియా ర్యాంకులు
ఎస్ఆర్ కళాశాల విద్యార్థికి
ఎస్టీ విభాగంలో 98వ ర్యాంకు
సంతోషంగా ఉంది
ఇంటర్తోపాటు తొలి ప్రయత్నంలోనే జేఈఈ మెయిన్స్లో ఆలిండియా 824 ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. అద్భు తమైన ర్యాంకు సాధించడానికి కళాశాల యాజమాన్యం ఎంతగానో తో డ్పాటు అందించింది. కాకతీయ ఉపాధ్యాయ బృందం ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ మంచి విద్యాబోధన అందించింది.
– మేఘన, 824 ర్యాంకు,
కాకతీయ కళాశాల

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా