
కమ్మర్పల్లిలో ఈదురు గాలులు
కమ్మర్పల్లి: మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఉప్లూర్, నాగాపూర్లో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మండల కేంద్రంలో ఆకుల బాలకృష్ణకు చెందిన మామిడి తోటలో కాయలు నేలరాలి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది.
రేపు ఎంజేపీ గురుకుల ప్రవేశపరీక్ష
నిజామాబాద్అర్బన్: మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఈ నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో సత్యనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో 2,611 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని, విద్యార్థులు హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.