నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని సీహెచ్సీ లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. డాక్టర్ శైలజ, డాక్టర్ స్వప్న, డాక్టర్ ముఖేష్ ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఆస్పత్రికి వచ్చారు. రోగులకు రక్త పరీక్షల్లో సీబీపీ టెస్ట్ ఫలితాలు రావడం లేదని ల్యాబ్ టెక్నీషియన్ మధు తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో 3 సిజేరియన్లు జరిగినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
భైంసా మండలం...
భైంసా మండలం మహగాం పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు ఒకరే ఉన్నారు. నలుగురు స్టాఫ్ నర్స్లకు ఒకరు డిప్యూటీషన్లో ఉన్నారు. వార్డ్ బాయ్స్ పోస్టులు లేవు,


