భర్త కష్టం చేసి వస్తే, ఆ భార్య ప్రేమతో ఆయనను చూసుకునేది. తమలా తమ పిల్లలు కష్టపడొద్దని వారిద్దరూ పడ్డ తపన ఇప్పుడు ఆ కుటుంబం ఓ స్థాయిలో ఉండటానికి కారణమైంది. అప్పుడు వారు కలిసి పంచుకున్న కష్టసుఖాలే వారిని ఇప్పటికీ రాజు, రాణిలా నిలిపాయి. నిర్మల్ జిల్లాకేంద్రంలోని గొల్లపేట్కు సింగారి రాజలింగం, రాజమణిలకు దాదాపు 80 ఏళ్ల వయసు. వీరికి ఐదుగురు కుమారులు. హమాలీ పనిచేస్తూనే పిల్లలను ప్రయోజకులను చేశారు. అందరినీ ఏకతాటిపై నిలిపి ఉమ్మడి కుటుంబంగా కొనసాగిస్తున్నారు. నేటికీ ఈ జంట ఉండే తీరే అంతపెద్ద కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది.


