భైంసాటౌన్: పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో, మిర్జాపూర్ మార్గంలో గోశాలకు చెందిన భూముల్లో అక్రమంగా చేపడుతున్న మొరం తవ్వకాలను అడ్డుకోవాలని గోశాల నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు శనివారం ఘటనాస్థలికి వెళ్లి మొరం తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. మొరం అక్రమ తవ్వకాలపై తహసీల్దార్ శశిభూషణ్ను ‘సాక్షి’ వివరణ కోరగా, సమాచారం తెలిసిన వెంటనే ఆర్ఐ రఘురాంను పంపినట్లు చెప్పారు. అయితే, అప్పటికే టిప్పర్, జేసీబీ వెళ్లిపోయినట్లు వెల్లడించారు.


