ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడి, ఉక్కపోత పెరుగుతుంది. ఒకటిరెండు చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది.
ఆమే.. ఆయన
కం(ఇం)టి దీపం..
ఆమె లేకుంటే ఆయనకు క్షణం కూడా గడవదు. అసలు.. ఏమీ కనిపించదు. ఏదీ చేయలేడు. అందుకే ఆమె తన ఇంటికి, కంటికీ వెలుగునిచ్చే దీపం. కడెం మండలం పాండవపూర్ గోండుగూడకు చెందిన పుర్క లక్ష్మి, హనుమంతు దంపతులు నేటి సమాజానికి ఆదర్శం. వీరికి ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేశారు. వీరికున్న ఎకరం భూమిలోనే హనుమంతు, లక్ష్మి వ్యవసాయం చేసేవారు. ఐదేళ్ల క్రితం భర్త హనుమంతు కంటిచూపు కోల్పోవడంతో లక్ష్మి కంటికిరెప్పలా ఆయనను కాపాడుకుంటోంది. ఆరుపదుల వయసులోనూ అన్నీ తానై ఆయనను నడిపిస్తోంది.


