తోడునీడగా..
సుఖాలు పంచుకుంటూ కష్టాలు రాగానే మారిపోయే నేటితరం జంటలకు ఈ 80 ఏళ్లు దాటిన అనసూయ, నర్సారెడ్డి జంట అసలైన ఆదర్శం. ఖానాపూర్ మండలం దిలావర్పూర్కు చెందిన ఏనుగు అనసూయ, నర్సారెడ్డిలది వ్యవసాయ కుటుంబం. తాము కష్టపడుతూ ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లను ప్రయోజకులను చేశారు. కుమారులు అశోక్రెడ్డి టీచర్గా, దేవేందర్రెడ్డి ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు. అనసూయ, నర్సారెడ్డి పిల ్ల ల సంతానానికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఈ కుటుంబమంతటికీ.. ఇప్పటికీ ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉంటున్న ఈ ఎవర్గ్రీన్ దంపతులే ఆదర్శం.


