
టెన్త్ జిల్లా టాపర్లకు నగదు ప్రోత్సాహం
నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం పదో తరగతి, ఇంటర్లో జిల్లా టాప్ నిలిచిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం నగదు బహుమతిని అందజేసి సత్కరించింది. జిల్లా వ్యాప్తంగా 8 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున కలెక్టర్ అభిలాష అభినవ్ అందించారు. ఎ.సాహిత్య, సాత్విక (పదో తరగతి) సోఫినగర్ గురుకుల పాఠశాల, విఘ్నేశ్వర్ (పదో తరగతి) కుంటా ల మోడల్ స్కూల్, రాజు (పదో తరగతి), మ స్కాపూర్ హైస్కూల్, అంజలి, సుప్రియ (ఇంటర్) సోఫీనగర్ కళాశాల, ఈ.అశ్విత్, ముత్యం(ఇంటర్) కుంటాల మోడల్ స్కూల్ విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు.