
కొలువుదీరిన అడెల్లి ఆలయ పాలకవర్గం
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయ నూతన పాలక మండలి కొలువుదీరింది. చైర్మన్ సింగం భోజాగౌడ్తోపాటు పదిమంది పాలకవర్గ సభ్యులతో దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్గౌడ్ శుక్రవారం ప్రమాణం చేయించారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్గా సింగం భోజాగౌడ్ను పాలకవర్గ సభ్యులు ముస్కు నర్సారెడ్డి ప్రతిపాదించగా రాజర్ల ప్రభాకర్గౌడ్ బలపరిచారు. ప్రమాణ స్వీకారం అనంతరం మండల నాయకులతో పాటు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు నూతన పాలకవర్గ మండలి సభ్యులను, చైర్మన్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, గండిరామన్న సాయిబాబ ఆలయ కమిటీ చైర్మన్ గంగోని బూరజ్, నాయకులు దాసరి రమేశ్, సత్యపాల్రెడ్డి, కొట్టె శేఖర్, ముత్యంరెడ్డి ఉన్నారు.