న్యూఢిల్లీ: కేరళ రాష్ట్ర పేరు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి కేరళ కాస్తా కేరళం అయ్యే చాన్స్ ఉంది. అయితే కేరళ పేరు మార్పు బిల్లును కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపాల్సి ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- కేరళ పేరు కేరళంగా మార్పు
- అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం
- గోండియా-జబల్పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం
- విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం
- మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మీదుగా మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు
- బొగ్గు, స్టీల్, ఇనుము, సిమెంట్ ,స్టోన్ చిప్స్ , ఫ్లై యాష్ ,ఫర్టిలైజర్స్, లైమ్ స్టోన్, మ్యాంగనీస్ , ఆహార ధాన్యాల రవాణాకు కీలకం కానున్న మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్.. ప్రతి ఏడాది 52 మిలియన్ టన్నుల సరుకు రవాణా
- 9072 కోట్ల రూపాయలతో 307 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం..2031 కల్లా నిర్మాణం పూర్తి
- జ్యూట్ మద్దతు ధర క్వింటాలు 5,295 రూపాయల పెంపుకు క్యాబినెట్ ఆమోదం
- పంట వ్యయంపై 61% పైగా లాభం వచ్చేలా మద్దతు ధర నిర్ణయం
- శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సివిల్ ఎన్క్లేవ్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
- 1,677 కో రూపాయలతో నిర్మాణం కానున్న సివిల్ ఎన్క్లేవ్
- ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 15 విమానాలు పార్కింగ్ చేసే సదుపాయం
- గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు నార్త్ సౌత్ కారిడార్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
- కారిడార్ నిర్మాణానికి ఒక వెయ్యి 67 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం


