భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర | Uma Bharti and Sadhvi Ritambhara Became Emotional | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర

Jan 22 2024 1:30 PM | Updated on Jan 22 2024 1:30 PM

Uma Bharti and Sadhvi Ritambhara Became Emotional - Sakshi

నాటి రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉమాభారతి, సాధ్వి రితంభర  అయోధ్యలో భాద్వేగానికి లోనయ్యారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర భావోద్వేగంతో ఒకరినొకరు కావలించుకున్నారు. నాటి అయోధ్య ఉద్యమ పోరాటాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఈ సమయంలో మాటలు లేవు.. భావాలు మాత్రమే కదలాడుతున్నాయి’ అని అన్నారు.

పరమ శక్తి పీఠం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంభర మాట్లాడుతూ ‘ప్రాణ ప్రతిష్ఠ’ శుభ ఘడియ ఇది.. యావత్ దేశం, యావత్ ప్రపంచం శోభాయమానంగా మారింది. కరసేవకుల త్యాగం అర్థవంతమైంది. రామ్‌లల్లా మనల్ని అనుగ్రహించేందుకు వచ్చాడు’ అని అన్నారు. 
ఇది కూడా చదవండి: మారిషస్‌ నుంచి డెన్మార్క్‌ ... అంతా రామమయం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement