లోయలోకి దూసుకెళ్లిన ఎస్‌యూవీ కారు.. 8 మంది మృతి

SUV Falls Into Gorge In Jammu and Kashmir Kishtwar Several Dead - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్‌యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

ఎస్‌యూవీ కారు.. చింగమ్‌ ప్రాంతం నుంచి ఛత్రూకు వెళ్తోందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బొండా గ్రామానికి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు చెప్పారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరోవైపు.. కారు లోయలో పడి 8 మంది మృతి చెందిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. అన్ని విధాల అవసరమైన సాయం అందిస్తామన్నారు.

ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top