ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు

Stealing Voting Machines: Akhilesh Yadav - Sakshi

లక్నో: వాస్తవానికి స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉండాల్సిన ఈవీఎంలను తరలిస్తున్న ఓ ట్రక్కును వారణాసి వద్ద అడ్డగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) చీఫ్‌ అఖిలేశ్‌ తెలిపారు. మరో రెండు ట్రక్కులు తప్పించుకున్నాయన్నారు. అధికార బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వారణాసి ఎన్నికల అధికారులు మాత్రం.. ఆ ఈవీఎంలు శిక్షణ కోసం వాడేవని స్పష్టంచేశారు. అఖిలేశ్‌ ఆరోపణలపై డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖండించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునేందుకు వీలుగా అభ్యర్ధులందరికీ ఈసీ తగు ఏర్పాట్లు చేసిందన్నారు.  

(చదవండి: మేయరైన ఆటోవాలా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top