సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం | PM Modi Speaks To Chief Justice, Condemns Attack On Him | Sakshi
Sakshi News home page

సీజేఐపై దాడికి యత్నం.. ప్రధాని మోదీ ఆగ్రహం

Oct 6 2025 9:28 PM | Updated on Oct 6 2025 9:29 PM

PM Modi Speaks To Chief Justice, Condemns Attack On Him

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సీజేఐపై దాడికి యత్నించిన ఘటనను మోదీ ఖండించారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్‌6న) ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీట్‌లో ‘భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌తో మాట్లాడాను. ఈ రోజు సుప్రీం కోర్ట్ ప్రాంగణంలో జరిగిన ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇలాంటి దారుణమైన చర్యలకు స్థానం లేదు. ఇది పూర్తిగా ఖండించదగిన చర్య. ఈ పరిస్థితిలో న్యాయమూర్తి గవాయ్ చూపిన శాంత స్వభావాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది న్యాయ విలువల పట్ల ఆయన నిబద్ధతను, అలాగే మన రాజ్యాంగాన్ని బలపరిచేందుకు చేసిన ఆయన కృషిని ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.

 

 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement