సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10వేల జ‌రిమానా | Penalty Of 10,000 Rupees Imposed People Using Phones While Driving | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10వేల జ‌రిమానా

Jul 31 2020 3:54 PM | Updated on Jul 31 2020 4:12 PM

Penalty Of 10,000 Rupees Imposed People Using Phones While Driving - Sakshi

ల‌క్నో :  రోడ్డు ప్ర‌మాదాలను అరికట్టే ల‌క్ష్యంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారికి 10 వేల రూపాయ‌ల జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించింది. గురువారం దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. డ్రైవింగ్ నిబంధ‌న‌ల‌కు సంబంధించి గ‌త నెల‌లోనే ఓ జీవో జారి చేసింది. ఇందులో మొద‌టిసారి డ్రైవింగ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారికి 500ల రూపాయ‌లు, రెండ‌వ‌సారి ఉల్లంఘించి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవాళ్లు నాలుగు రెట్లు ప్ర‌మాదానికి గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు డ‌బ్యూహెచ్‌వో ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది. (బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విసర్జించినా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement