Twitter Parliamentary Committee: Parliamentary Committee Summons Twitter New IT Rules - Sakshi
Sakshi News home page

ట్విటర్‌కు మరోసారి నోటీసులు

Jun 15 2021 11:28 AM | Updated on Jun 15 2021 6:23 PM

 Parliamentary committee summons Twitter new IT rules - Sakshi

సాక్షి,న్యూ ఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విటర్‌పై గురిపెట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరుకావాలని  ట్విటర్‌కు పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది.  కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంపై ట్విటర్‌పై  మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం  చేసింది. ఈ మేరకు ఇటీవల తుది నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. పదే పదే నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది.  మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్‌  నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ  ఇవ్వాలని ఆదేశించింది. 

చదవండి :  కొత్త సీపాప్‌ మెషీన్‌: కరోనా బాధితులకు వరం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement