పోలీసులపై బాలల హక్కుల సంఘం చీఫ్‌ సంచలన ఆరోపణలు

NCPCR Chairperson Priyank Kanoongo Alleges Assault By Kolkata Police - Sakshi

బాలల హక్కుల సంఘం చీఫ్‌ ప్రియాంక కనూంగో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసి దుర్భాషలాడరని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అధికారులు. తాము ఆయనకు సహకరించామని, అతనే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ వారంలో కోల్‌కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక మైనర్ తన పొరుగింటి వారి చేతిలోనే హత్యకు గురయ్యింది.

ఈ విషయమైన తాను అక్కడకు వచ్చానని నేషనల్‌ కమిషన్‌ ప్రోటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) చైర్‌ పర్సన్‌ ప్రియాంక కనూంగో చెప్పారు. అప్పుడే కోల్‌కతా పోలీసులు తనపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు మాపై జరుపుతున్న దర్యాప్తు ప్రక్రియలను రహస్యంగా రికార్డు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించినందుకే తనపై దాడి చేరని కనూంగో సోషల్‌ మీడియా వేదికగా హిందీలో ట్వీట్‌ చేశారు.

దీనిపై పశ్చిమ బెంగాల్‌ కమీషనర్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(డబ్ల్యూసీపీసీఆర్‌) చీఫ్‌ సుదేష్నా రాయ్‌ స్పందిస్తూ..తనను, తమ సహోద్యోగులను కనూంగో అవమానించాడని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఎన్‌సీపీసీఆర్‌ బృందం మాకు సమాచారం ఇవ్వకుండా ఆ బాలిక కుటుంబం వద్దకు వెళ్లిందన్నారు. నిజానికి ఆ ప్రతిపాదిత పర్యటన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్నే పేర్కొంటూ రాయ్‌ ఎన్‌సీపీసీఆర్‌కి లేఖ కూడా రాశారు.

(చదవండి: విమానంలో మరో అనుచిత ఘటన: తాగిన మత్తులో 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top