
భోపాల్: బిడ్డను కనడానికి తన భర్తను జైలు నుంచి బయటకు పంపాలని కోరుతూ ఓ మహిళ మధ్యప్రేదశ్ హైకోర్టును ఆశ్రయించింది. సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని అభర్థించింది. నంద్ లాల్ Vs కేసులో రాజస్థాన్ హైకోర్టు ఆదేశం ప్రకారం సంతానోత్పత్తికి ప్రాథమిక హక్కు అని కోరింది.
మహిళ పిటిషన్పై అక్టోబర్ 27న విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. బిడ్డను కనడానికి ఆ మహిళ ఆరోగ్యంగా ఉందో? లేదో? పరీక్షించాలని ఐదుగురు డాక్టర్లతో కూడిన బృందాన్ని కోరింది. అయితే.. రికార్డ్ల ప్రకారం మహిళ మోనోపాజ్(బుుతుక్రమం) వయస్సు దాటిపోయిందని ప్రభుత్వ న్యాయవాది సుబోధ్ కథార్ తెలిపారు.
వైద్యుల రిపోర్టు నవంబర్ 7న రానున్నాయి. వైద్యుల రిపోర్టు తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం