ఐదు లక్షల రివార్డు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి | Two Maoists Encounter With Security Forces In Chhattisgarh Bijapur, Operation Ongoing | Sakshi
Sakshi News home page

ఐదు లక్షల రివార్డు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Feb 26 2026 10:29 AM | Updated on Feb 26 2026 1:12 PM

Maoists Encounter At Chhattisgarh Bijapur

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భదత్రా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

వివరాల మేరకు.. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నది తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్‌ఎల్‌ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను, మావోయిస్టు సామగ్రి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, మృతి చెందిన మావోయిస్టులను భద్రతా బలగాలు గుర్తించాయి.

(1) భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు ACM హిచామి మద్దా (₹5.00 లక్షల రివార్డు ఉంది)

(2) భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు ACM మంకి పోడియం (₹5.00 లక్షల రివార్డు)

స్వాధీనం చేసుకున్న సామాగ్రి, ఆయుధాలు:
1. ఒక SLR రైఫిల్, మూడు మ్యాగజైన్‌లు, 55 రౌండ్లు
2. ఒక INSAS రైఫిల్, మూడు మ్యాగజైన్‌లు, 19 రౌండ్లు
3. ఒక 12-బోర్ గన్, రెండు షెల్లు
4. రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రెండు స్వదేశీ హ్యాండ్ గ్రెనేడ్‌లు, డిటోనేటర్లు, స్కానర్ బ్యాటరీలు, యంత్రాంగాలు, మందులు, పౌచ్‌లు

అనంతరం, బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని పోలీసులు, భద్రతా దళాలు ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి కట్టుబడి ఉన్నాయి. DRG, బస్తర్ ఫైటర్స్, STF, CRPF, CoBRA, ఇతర భద్రతా దళాలు పరిసర ప్రాంతాలలో నిరంతర శోధన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని అన్నారు.

అలాగే, బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పట్టలింగం మాట్లాడుతూ..‘మాజీ మావోయిస్టు క్యాడర్లు బార్సే దేవా, రూపేష్, రనిత, రాజ్‌మాన్, రాజు సలాం, దేవ్‌జీ, సంగ్రామ్, భూపతి, వెంకటేష్, చాలా ఇతర మావోయిస్టు కేడర్‌ మాదిరిగానే, మిగిలిన క్రియాశీల కేడర్లు కూడా హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలి. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయుధాలు, హింసలో పాల్గొనడం కొనసాగించడంలో అర్థం లేదు. ప్రభుత్వం.. కేడర్‌తో సహా ప్రతి ఒక్కరికీ ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి కట్టుబడి ఉందని తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement