రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భదత్రా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వివరాల మేరకు.. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నది తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టలింగం తెలిపారు.


