మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక ప్రకటన | Maoist Central Committee Calls for Bharat Bandh June 10 | Sakshi
Sakshi News home page

మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక ప్రకటన

May 31 2025 6:24 PM | Updated on May 31 2025 7:02 PM

Maoist Central Committee Calls for Bharat Bandh June 10

చత్తీస్‌ఘడ్‌:  జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.  27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌​కు పిలుపునిచ్చింది. అదే సమయంలో జూలై 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది.

వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి.  ఇది గతేడాది నుంచి  ఊపందుకోగా, ఈ  ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావో​యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది. 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జ.రపాలని కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ ఇదివరకే విన్నవించింది. అయితే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన భారత్ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement