Wife Tortured: మతం మారలేదని భార్యకు చిత్రహింసలు! | Karnataka Man Tortured Wife For Conversion In shivamogga | Sakshi
Sakshi News home page

Wife Tortured: మతం మారలేదని భార్యకు చిత్రహింసలు!

Nov 19 2022 11:00 AM | Updated on Nov 19 2022 11:07 AM

Karnataka Man Tortured Wife For Conversion In shivamogga - Sakshi

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆపై చిత్రహింసలతో మతం మారాలంటూ.. 

సాక్షి,బళ్లారి: మతం మారడం లేదని భార్యను హత్య చేసేందుకు యత్నించిన భర్త ఉదంతం చిత్రదుర్గలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రదుర్గకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ శివమొగ్గకు చెందిన ఉమాను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు.

వివాహం తర్వాత మతం మారాలని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించి తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యంపాలైంది.  కాళ్లు రెండు పని చేయకుండా పోయాయి. తోడునీడుగా ఉండాల్సిన భర్త ఆమెను  హింసించడమేగాక చివరకు గొంతు నులిమి చంపాలని యత్నించాడు.

బాధితురాలు తన బంధువు విశ్వనాథ్‌కు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో చిత్రదుర్గ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు  అబ్దుల్‌ ఖాదర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement