నిధులు వెనక్కు పంపడం ఇష్టం లేక.. రూ.69 లక్షలు జేబుల్లో​కి | Karnataka: 69 Lakhs Scam In Anneshwara Grama Panchayat Office | Sakshi
Sakshi News home page

నిధులు వెనక్కు పంపడం ఇష్టం లేక.. రూ.69 లక్షలు జేబుల్లో​కి

Aug 11 2021 12:58 PM | Updated on Aug 11 2021 1:05 PM

Karnataka: 69 Lakhs Scam In Anneshwara Grama Panchayat Office - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కరోనా కాలంలో తలుపులే తెరవని పాఠశాలో కంప్యూటర్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని రూ.69 లక్షలు గోల్‌మాల్‌ చేశారు. దేవనహళ్లి తాలూకా అణ్ణేశ్వర గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ స్కాం జరిగింది. రూ.69 లక్షలు సీసీ  కెమెరాలు, కంప్యూటర్లు కొనుగోలు చేసి జీపీ ఆఫీసుతో పాటు తమ పరిధిలోని పాఠశాలలకు ఏర్పాటు చేశామని అధికారులు లెక్కలు రాశారు. అయితే ఎక్కడా సీసీ  కెమెరాలు, కంప్యూటర్లు కనిపించడంలేదు. పీడీఓ ఇనాందార్‌ను ఇదేమని ప్రశ్నిస్తే నిధులు వెనక్కు పంపించడం ఇష్టం లేకే లెక్కలు రాశామని సమర్థించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement