జేఈఈ–మెయిన్‌ నాలుగో ఎడిషన్‌ వాయిదా | JEE-Main 4th edition postponed, to be held from 26 Aug-2 September | Sakshi
Sakshi News home page

జేఈఈ–మెయిన్‌ నాలుగో ఎడిషన్‌ వాయిదా

Jul 16 2021 5:53 AM | Updated on Jul 16 2021 5:53 AM

JEE-Main 4th edition postponed, to be held from 26 Aug-2 September - Sakshi

న్యూఢిల్లీ:  ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ)–మెయిన్‌ ఫోర్త్‌ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం ప్రకటించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండు సెషన్ల మధ్య 4 వారాల విరామం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్త్‌ ఎడిషన్‌ జేఈఈ–మెయిన్‌ పరీక్షను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్‌ 2 వరకూ నిర్వహిస్తామన్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్ష జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగాల్సి ఉంది.

జేఈఈ–మెయిన్‌ నాలుగో సెషన్‌ కోసం ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌ గడువును జూలై 20 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. జేఈఈ–మెయిన్‌ నాలుగో సెషన్‌ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1, 2వ తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్షను 334 దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సీనియర్‌ డైరెక్టర్‌ సాధన పరాశర్‌ చెప్పారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 828కి పెంచినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement