Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే  | History of major terror attacks in Jammu and Kashmir 2000 to 2025 | Sakshi
Sakshi News home page

Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే 

May 8 2025 2:00 AM | Updated on May 8 2025 2:00 AM

History of major terror attacks in Jammu and Kashmir 2000 to 2025

అందాల కశ్మీరం ఉగ్రవాదులతో దశాబ్దాలుగా అగ్నిగుండంగా మారింది. 2000 నుంచి అక్కడ జరిగిన దాడులకు 700 మందికి పైగా భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. వాటిలో ముఖ్యమైనవి.. 

2000 మార్చి 21: అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భారత్‌లో పర్యటిస్తున్న వేళ టెర్రరిస్టులు చెలరేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా చట్టీసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను కాల్చి చంపారు. 
∙ 2000లోనే అమర్‌నాథ్‌ యాత్రికులపై పహల్గాం బేస్‌ క్యాంప్‌ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. 
∙ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్‌నాథ్‌ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. 
∙ 2001 అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. 
∙ 2002లో జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. 
∙ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. 
∙2014: ఉరిలో ఆత్మాహుతి దాడికి దిగి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. 
∙2015: కథువా పోలీస్‌ స్టేషన్‌పై దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. 
∙2016: ఉరిలో సైనిక క్యాంపుపై దాడికి తెగబడి 18 మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. 
∙2017లో అమర్‌నాథ్‌ యాత్ర నుంచి తిరిగొస్తున్న భక్తులపై కాల్పుల్లో 18 మంది మరణించారు. 
∙2019: పుల్వామాలో సీఆరీ్పఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడికి 40 మంది జవాన్లు బలయ్యారు. 
∙2025 ఏప్రిల్‌ 22: బైసారన్‌లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement