ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు

Delhi Police arrests 9 over posters against PM - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 25 మందిని అరెస్ట్‌ చేయడంతోపాటు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కనిపించిన ఆ పోస్టర్లపై ‘మోదీజీ..మా పిల్లల వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎందుకు పంపించారు?’ అని ఉందని పోలీసులు తెలిపారు. సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు స్పందిస్తూ..‘ ప్రస్తుతానికి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎవరి ప్రోద్బలం మేరకు ఈ పోస్టర్లను అంటించారనే దానిపై విచారణ చేపట్టాం. బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. ఈ పోస్టర్లను అంటించినందుకు తనకు రూ.500 ఇచ్చారని నార్త్‌ ఢిల్లీలో అరెస్టయిన వ్యక్తి పోలీసు విచారణలో వెల్లడించాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top