పాత వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి | Central Plans To Make Fastag Mandatory For Vehicles sold before 2017 | Sakshi
Sakshi News home page

పాత వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి

Sep 4 2020 8:59 AM | Updated on Sep 4 2020 10:39 AM

Central Plans To Make Fastag Mandatory For Vehicles sold before 2017 - Sakshi

న్యూఢిల్లీ :  టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  డిజిటల్, ఐటీ ఆధారిత టోల్‌ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్‌ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫాస్టాగ్‌ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్‌ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో  2021 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సెంట్రల్‌ మోటర్‌ వెహికల్స్‌ నిబంధనలకు రహదారి రవాణా శాఖ సవరణలు ప్రతిపాదించింది. సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. (ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement