నేను అమన్‌ సొంతం.. నాకు అల్లుడే కావాలి.. | UP Bride Sithara Wedding Night Runs Away For Nephew In Prayagraj | Sakshi
Sakshi News home page

నేను అమన్‌ సొంతం.. నాకు అల్లుడే కావాలి..

Jun 25 2025 8:21 AM | Updated on Jun 25 2025 12:34 PM

UP Bride Sithara Wedding Night Runs Away For Nephew In Prayagraj

లక్నో: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని.. భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. నాటకీయంగా మొదటి రాత్రి వధువు ప్రవర్తనతో వరుడు ఖంగుతిన్నాడు. ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా.. నేను అమన్‌కు మాత్రమే సొంతం’ అంటూ భర్తకు భార్య వార్నింగ్‌ ఇచ్చింది. అనంతరం, అర్ధరాత్రి ఇంట్లో నుంచి నవ వధువు పరారీ అయ్యింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారను వివాహం చేసుకున్నాడు. అనంతరం, ఏప్రిల్ 30న వధువు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. మే రెండో తేదీన కొత్త జంటలకు ఘనంగా రిసెప్షన్ జరిగింది. తర్వాత, కుటుంబ సభ్యులు వారిద్దరూ మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు. కొత్త జంటకు లోపలికి వెళ్లగానే.. వరుడికి ఊహించని అనుభవం ఎదురైంది. వధవు..‘నన్ను ముట్టుకుంటే.. నువ్వు 35 ముక్కలుగా కనిపిస్తావు. నేను అమన్‌ను ప్రేమిస్తున్నా. నేను అమన్‌ సొంతం’ అని సితార తన భర్తను కత్తితో బెదిరించింది. ఈ అనూహ్య ఘటనతో ఖంగుతిన్న నిషాద్‌కు ఏం చేయాలో తెలియక సైలెంట్‌ అయిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది.

దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్‌ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. సితారకు అమన్‌ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. 

ఈ ఘటన అనంతరం, భర్త నిషాద్‌ మాట్లాడుతూ..‘నేను గదిలోకి వెళ్లగానే ఆమె నిశ్శబ్దంగా పూర్తిగా ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని కూర్చుని ఉంది. ఆమె నాతో సూటిగా ఒక్కటే చెప్పింది. నన్ను ముట్టుకోవద్దు. నేను అమన్ ఆస్తిని. నువ్వు నన్ను తాకాలని ప్రయత్నిస్త.. నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను అని బెదిరించింది. నన్ను అమన్ వద్దకు పంపించు అని చెప్పింది. దాంతో, నాకు ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రంతా ఆమె కత్తితో మంచం మీద ఉండగా నేను సోఫాలో కూర్చున్నాను. నిద్రపోయే ధైర్యం చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రవర్తనపై అటు నిషాద్‌ పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement