Bihar Election: సింగర్‌ మైథిలి ఠాకూర్‌ ముందంజ | BJPs Maithili Thakur Races Ahead As Early Trends Break In Alinagar Assembly Seat Results | Sakshi
Sakshi News home page

Bihar Election Results: సింగర్‌ మైథిలి ఠాకూర్‌ ముందంజ

Nov 14 2025 8:54 AM | Updated on Nov 14 2025 9:49 AM

BJPs Maithili Thakur races ahead as early trends break

అలీనగర్: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. ఫలితాలు రౌండ్‌ల వారీగా  వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని జనరల్ నియోజకవర్గం అలీనగర్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన జానపద గాయని, బీజేపీ సాంస్కృతిక రాయబారి మైథిలి ఠాకూర్‌ తొలి ఫలితాల్లో ముందంజలో ఉన్నారు.

బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని అలీనగర్‌లో చాలా ఏళ్లుగా ఎన్నికల్లో హోరాహోరీ పోటీ ఏర్పడుతోంది. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన జానపద గాయని  మైథిలి ఠాకూర్‌పై అందరి దృష్టి నిలిచింది. ఆమె  అలీనగర్ నుండి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్‌ను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా బీజేపీ ఇక్కడ సునాయాస విజయం సాధించేందుకు ప్లాన్‌ చేసింది. మైథిలి ఠాకూర్‌పై ఆర్జేడికి చెందిన వినోద్ మిశ్రా పోటీ పడుతున్నారు. మైథిలి ఠాకూర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ.4 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఆమె వార్షిక ఆదాయం ఐదు సంవత్సరాలలో రూ.12.02 లక్షల నుండి రూ.28.67 లక్షలకు పెరిగిందని తెలిపారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీలలో జరిగాయి. నేడు (నవంబర్ 14) కౌంటింగ్ జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement